నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
రైతులకు పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి
30 Oct 2013 3:03 PM
విజయనగరం, 30 అక్టోబర్ 2013:
భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీని త్వరగా అందజేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ తరఫున పంట నష్టంపై తాము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలో వరద ముంపునకు గురైన పూసపాటిరేగ మండలం కొవ్వాడ, భోగాపురం తదితర ప్రాంతాల్లో శ్రీమతి విజయమ్మ బుధవారం పర్యటించారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. రైతుల తరపున తాము అసెంబ్లీలో పోరాడతామన్నారు. రైతులంతా ధైర్యంగా ఉండాలని శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తి సంగతిని శ్రీమతి విజయమ్మ రైతులకు తెలిపారు. కోర్టు అనుమతిస్తే జగన్బాబు నేరుగా వచ్చి రైతులను పరామర్శిస్తారని ఆమె తెలిపారు. శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారందరికి పక్కా ఇళ్లు కట్టిస్తారని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు.
పేదల అభ్యున్నతి కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిరంతరం శ్రమించారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. శ్రీ వైయస్ జగన్ కూడా ఆ మహానేత బాటలోనే నడిచి ఆయన స్వప్నాలను సాకారం చేస్తారని శ్రీమతి విజయమ్మ చెప్పారు.