<strong>రాజోలు (తూర్పుగోదావరి జిల్లా),</strong> 7 మే 2013: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు పార్టీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాజోలు కో ఆర్డినేటర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టిబ్బాయి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.