వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. యాత్ర జరిగే నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జ్లతో అన్ని వివరాలు చర్చించారు. ఈ యాత్రలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ప్రతీ కార్యకర్త కొంత దూరమైనా షర్మిల పరామర్శ యాత్రలో పాల్గొనాలని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, నల్లా సూర్య ప్రకాష్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహిపాల్ రెడ్డి, భీష్వ రవీందర్, అమృతసాగర్, సూరజ్ ఎజ్దానీ, ధనలక్ష్మి, ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు.