మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సార్వత్రికంలో వైయస్ఆర్సీపీకే విజయం
13 May 2014 2:03 PM
హైదరాబాద్:
శానససభ, లోక్సభ ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామనుకుంటున్న టీడీపి నాయకులు నాలుగు రోజుల పాటు ఉపశమనం పొందడానికి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయే గానీ అంతకు మించిన ప్రభావం ఏమీ ఉండదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఈ నెల 16న వెలువడే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవని ఆయన ధీమాగా చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం గట్టు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తాము ఊహించనివేమీ కాదన్నారు. ఐదారు మున్సిపాలిటీలు అదనంగా వస్తాయనుకున్నాం కానీ రాలేదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికలను టీడీపీ జీవన్మరణ సమస్యగా తీసుకుని డబ్బు విపరీతంగా కుమ్మరించిందని అందుకే ఎక్కువ సీట్లు పొందగలిగిందని గట్టు వ్యాఖ్యానించారు. పైగా ఈ ఎన్నికలు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలా...వద్దా? అనే అంశంపై జరిగినవి కావన్నారు. అలాగే టీడీపీ వాళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓట్లడిగిన ఎన్నికలు కూడా కావన్నారు. తాము గెల్చుకున్న మున్సిపాలిటీలన్నీ కొత్తగా టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి గెల్చుకున్నవిగా మీడియా గుర్తించాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికలు కేవలం 90 నియోజకవర్గాల పరిధిలోని 20 శాతం ఓటర్లకు సంబంధించిన ఫలితాలేనని.. పేద, బడుగు, బలహీన, మైనారిటీవర్గాల వారు 80 శాతం మంది గ్రామీణ ఓటర్లలో ఉన్నారని వివరించారు. 2006లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి ఎంపీటీసీల్లో 38 శాతం ఓట్లు వస్తే జెడ్పీటీసీలకు వచ్చేసరికి 31 శాతానికి పడిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీల్లో 51 శాతం ఓట్లు వస్తే జెడ్పీటీసీలకు వచ్చేటప్పటికి 61 శాతానికి పెరిగాయని తెలిపారు.
ఒకే సారి జరిగిన ఎన్నికల్లో రెండు పదవులకు పోలైన ఓట్ల వ్యత్యాసం 10 శాతం ఉండటం గమనించాల్సిన విషయమని గట్టు రామచంద్రరావు అన్నారు. అసలివి అంత పరిగణనలోకి తీసుకోవాల్సిన ఎన్నికలే కావన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత మోడీ, పవన్కళ్యాణ్ విషయంలో సీమాంధ్రలో వచ్చిన వ్యతిరేకత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి బాగా లాభం చేకూరుస్తుందని తెలిపారు. సీమాంధ్రను విభజించిందే బీజేపీ అన్న భావన ప్రజల్లో ఉందన్నారు.
పట్టణ ప్రాంత ఓటర్లు వైయస్ఆర్సీపీకి ఎందుకు దూరమయ్యారనేది తాము విశ్లేషించుకుంటామని గట్టు చెప్పారు. సంస్థాగతంగా వైయస్ఆర్సీపీ ఇంకా బలపడాల్సి ఉందన్న వాస్తవాన్ని కూడా గ్రహించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యతపై సంబరాలు జరుపుకుంటున్న వారికి కూడా శాసనసభ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే విషయం స్పష్టంగా తెలుసునని గట్టు చెప్పారు.