తెలంగాణ మీ అబ్బ సొత్తా? : గట్టు ఫైర్

హైదరాబాద్‌, 31 అక్టోబర్ 2013:

తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్త‌ంకుమార్ రెడ్డిలపై పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ మీ అబ్బ సొత్తా.. మీ అబ్బ జాగీరా? అంటూ నిలదీశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీసీ, ఎస్సీ, మైనారిటీలపై భూస్వామ్య, పెట్టుబడిదారులు చేసిన అరాచకాలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

రాజ్యంగపరమైన హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది అని రామచంద్రరావు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్‌గా పోజులు కొట్టే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ ప్రభుత్వం ‌కాలరాస్తోంది అని విమర్శించారు.

Back to Top