వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తెలంగాణ మీ అబ్బ సొత్తా? : గట్టు ఫైర్
31 Oct 2013 6:08 PM
హైదరాబాద్, 31 అక్టోబర్ 2013:
తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నల్గొండ జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలపై పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ మీ అబ్బ సొత్తా.. మీ అబ్బ జాగీరా? అంటూ నిలదీశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీసీ, ఎస్సీ, మైనారిటీలపై భూస్వామ్య, పెట్టుబడిదారులు చేసిన అరాచకాలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
రాజ్యంగపరమైన హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది అని రామచంద్రరావు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చాంఫియన్గా పోజులు కొట్టే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సోనియాగాంధీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను కిరణ్ ప్రభుత్వం కాలరాస్తోంది అని విమర్శించారు.