<br/><strong>- దిగ్వియంగా వైయస్ జగన్ పాదయాత్ర</strong><strong>- ప్రజల కష్టాలు తెలుసుకుంటూ..భరోసా కల్పిస్తున్న రాజన్న బిడ్డ</strong><strong>- అడుగడుగునా ఘన స్వాగతం</strong>కృష్ణా జిల్లా: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించింది. గతేడాది నవంబర్ 6వ తేదీ ఇడుపులపాయలో మొదలైన వైయస్ జగన్ పాదయాత్ర నేటికి 150వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు వైయస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకొని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. 150వ రోజు మంగళవారం ఉదయం గూడూరు మండలం పర్ణశాల నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. చిట్టి గూడూరు, గూడూరు, రామరాజు పాలెం క్రాస్ల మీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోని సుల్తా నగరంలోకి ప్రవేశించనుంది. అక్కడి నుంచి మచిలీపట్నం చేరుకుని సాయంత్రం కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. దారి పొడవునా ప్రజల సమస్యలు వింటూ, వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.<br/><strong>మండుటెండలను సైతం లెక్క చేయకుండా</strong>నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోడానికి వందల మైళ్లు దాటి నడచివస్తుంటే జననేతకు పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతిస్తున్నాయి. మెండైన ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని ఆయన అడుగులు రాష్ట్ర చరిత్రను ప్రభావితం చేస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా మండుటెండను సైతం లెక్కచేయక ప్రజల కోసం వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. జగన్ అడుగులో అడుగు వేసి జనం ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లలో తోడు ఉంటానంటూ వైయస్ జగన్ వారికి భరోసా ఇస్తున్నారు. పాదయాత్రతో పాటు జగన్ సభలకు జనం పోటెత్తుతున్నారు. రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. అండగా తామున్నామంటూ రాజన్న బిడ్డపై జనం అభిమానాన్ని కురిపిస్తున్నారు. నువ్వే,మా ముఖ్యమంత్రివంటూ ఆశీర్వదిస్తున్నారు. జనం జగన్ ఒకరికొకరిగా ఈ యాత్ర సాగుతోంది. <br/>రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవాలి. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం దక్కేలా చూడాలి. ప్రతి పేద బిడ్డా గొప్పగా చదవి పెద్దవాడిగా ఎదగాలి. రైతన్నకు వ్యవసాయం పండుగ కావాలి. బడుగు బలహీన వర్గాల్లో బరోసా కల్పించాలి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోవాలి. ఇదే నా కసి అంటూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో ప్రతిపక్షనేత వైయస్జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. సుదీర్ఘయాత్ర నేటితో 150 రోజులు అవుతుంది.<br/>చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నాకున్నది ఒక్కటే కసి, నేను చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి. ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి. ఆ కసి నాలో ఉంది కాబట్టి ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను తొలి రోజు పాదయత్రలో వైయస్ జగన్ చెప్పారు.<br/>నేను వేసే ప్రతి అడుగులో మీ అప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైయస్ఆర్ పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశ్వీరాదాలు నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి .<br/>తొలి రోజు : వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభం.<br/>25వరోజు : కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం, మదనాంతపురంలో ప్రారంభం, చెరువు తొండలో ముగింపు.<br/>50వ రోజు : చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎంనుంచి ప్రారంభం, జమ్మిలవారిపల్లిలో ముగింపు.<br/>100వ రోజు : ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఉప్పలపాడులో ప్రారంభం.150వ రోజు: కృష్ణా జిల్లా గూడూరు మండలం పర్ణశాలలో ప్రారంభం