ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
సీఎన్ఎన్- ఐబీఎన్ సర్వే మోసపూరితం
02 Apr 2014 6:37 PM
హైదరాబాద్, 2 ఏప్రిల్ 2014:
మొత్తం 23 లోక్సభా నియోజకవర్గాల్లో కేవలం 1300 మంది నుంచి మాత్రమే అభిప్రాయాలు తీసుకుని సీఎన్ఎన్- ఐబీఎన్- సీఎస్డీఎస్ చేసిన సర్వే మోసపూరితం, కుట్రపూరితం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సర్వే ద్వారా ఆ సంస్థ ప్రజలను ఏప్రిల్ ఫూల్సును చేసిందని దుయ్యబట్టారు. పతన దశలో ఉన్న టీడీపీని, చంద్రబాబు నాయుడిని భూతద్దంలో చూపించి హైప్ సృష్టించేందుకే సీఎన్ఎన్- ఐబీఎన్ సర్వే ప్రయత్నించిందన్నారు. వాస్తవాలకు దగ్గరగా ఈ సర్వే ఫలితం లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లారు.
సీఎన్ఎన్- ఐబీఎన్- సీఎస్డీఎస్ సంస్థ సర్వేకు ఏమాత్రం విశ్వసనీయత లేదన్నారు. ఇంత దగా సర్వేను తానెప్పుడూ చూడలేదన్నారు. సీఎన్ఎన్- ఐబీఎన్ సర్వే తప్పులతడక అని ఆ చానల్ చర్చలో పాల్గొన్నవారే అన్నారని ఆయన ప్రస్తావించారు. ఇదంతా కుట్రపూరిత సర్వే అన్నారు. ఇది అసలు సర్వేనే కాదు.. ఏసీ రూముల్లో కూర్చుని చేసిన అంకెల గారడీ అని మైసూరారెడ్డి అభివర్ణించారు. ఇతరులకు 14 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే పేర్కొందని, అయితే ఆ ఓట్లు ఏ పార్టీకి వస్తాయో సీఎన్ఎన్- ఐబీఎన్- సీఎస్డీఎస్ సంస్థ వెల్లడించగలదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి ఒకేసారిగా 14 శాతం వస్తాయని చెప్పడమే మోసపూరితం అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఈ సర్వే అన్నారు.
గత సర్వేలో లోక్సభ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి 45 శాతం, టీడీపీకి 33 శాతం ఓట్లు వస్తాయని సీఎన్ఎన్- ఐబీఎన్ పేర్కొన్న వైనాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఈ రెండు పార్టీ మధ్య 12 శాతం తేడా ఉందన్నారు. సీఎన్ఎన్- ఐబీఎన్ సర్వేలో ఒక్క శాతం కూడా వాస్తవం లేదన్నారు.
సీఎన్ఎన్- ఐబీఎన్, ఈనాడులో పెట్టుబడులు పెట్టింది ఒక్కరే అని అందరికీ తెలిసిందే అన్నారు. టీడీపీకి పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెరిగితే జనసేన, లోక్సత్తా పార్టీల కలుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఛీ పొమ్మని బీజేపీ అంటున్నా ఎందుకు ఆ పార్టీ కాళ్ళా వేళ్ళా పడుతోందని మైసూరారెడ్డి ప్రశ్నించారు. నీల్సన్ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటే టీడీపీ నాయకులు బురద జల్లుతున్నారని మైసూరారెడ్డి విమర్శించారు.