వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహం
ఛార్జీలపై కదం తొక్కిన వైయస్ఆర్ సీపీ
26 Sep 2012 6:25 AM
పిఠాపురం: బస్సు చార్జీలపెంపుపై వైయస్ఆర్ సీపీ నేతలు మంగళవారం పిఠాపురంలో వినూత్న నిరసన నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి రిక్షాలతో మున్సిపల్ కార్యాలయం, కోటగుమ్మం, ఉప్పాడ సెంటర్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రాస్తారోకో, ధర్నా కార్యక్రమాల్లో వైయస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని బస్సు చార్జీల పెంపుపై నిరసన గళమెత్తారు. ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, బస్సు చార్జీలను తగ్గించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వాలు పతనం కాక తప్పదన్నారు. ఈ ఆందోళనకు మద్దతుగా పలువురు ప్రయాణికులు కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆర్టీసీ బస్కు ఒక వినతిపత్రం అందజేశారు.