కేంద్రసాయం పచ్చిమోసంః వైవీ సుబ్బారెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన సాయం పచ్చి మోసమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలసి రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నాయో... ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రానికి రూ.1,976 కోట్ల సాయం చేసిందంటూ కేంద్రప్రభుత్వంలోని టీడీపీ మంత్రి సుజనా చౌదరి వెల్లడించిన వ్యాఖ్యలపై వైవీ మీడియాతో మాట్లాడారు. తాము లోక్‌సభలో ప్రత్యేకహోదా కోసం నిరవధికంగా ఆందోళన చేస్తే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పుకొచ్చారని, ఏదో పెద్ద ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నారని, తీరా చూస్తే ఏమీ లేదని మండిపడ్డారు.

విభజన  చట్టంలో పేర్కొన్నవే ఇపుడిస్తున్నారని.. కొత్తగా ఇస్తున్నదేమీ లేదన్నారు.  ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. హోదా వస్తే అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్రాన్ని కోరామన్నారు. రాజధానికి ఇప్పుడిచ్చిన రూ.450 కోట్లు ఎందుకూ సరిపోవన్నారు. పోలవరం ఊసే లేదన్నారు. పోలవరం పరిస్థితీ అలాగే ఉందన్నారు. రాజధానికి కేంద్రమిచ్చిన నిధులు ...రంగులు వేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికే సరిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు
Back to Top