<strong><br/></strong><strong><br/></strong><strong><br/></strong><strong>కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వైయస్ఆర్ సీపీ సూటిప్రశ్న</strong><strong>గట్కరీ పర్యటనతో చంద్రబాబు అవినీతి బట్టబయలు</strong><strong>పట్టిసీమతో వందల కోట్ల అవినీతి జరిగింది వాస్తవం</strong><strong>ఎన్నికల్లో డబ్బు సంచులు మోసిన వారికి కాంట్రాక్టులు</strong><strong>కేంద్రమంత్రి పశ్నలకు నీళ్లు నమిలిన చంద్రబాబు</strong><strong>పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలి</strong><strong>కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న</strong>హైదరాబాద్: ఆంధ్రరాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉందా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. ఉంటే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు లైఫ్లైన్ లాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రమంత్రి గట్కరీ ప్రశ్నలతో చంద్రబాబు అవినీతి బట్టబయలైందన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక లైఫ్లైన్, వ్యవసాయానికి, విద్యుత్ శక్తికి, కోట్ల మంది ప్రజల గొంతు తడిపేందుకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆ శంకుస్థాపనలో పాల్గొనే మహాభాగ్యం కలిగిందన్నారు. సుమారు రూ. వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు పూర్తి చేశారని, నిర్మాణానికి కావాల్సిన అనుమతులు కూడా సాధించారని గుర్తు చేశారు. వైయస్ఆర్ తరువాత పాలించిన ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశాయన్నారు. <br/>రాష్ట్ర విభజన తరువాత జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరాన్ని అనే అంశాన్ని తెరమీదకు తీసుకురాకుండా స్వార్థంతో అవినీతికి ప్రాధాన్యం ఇస్తూ పట్టిసీమ నిర్మాణం చేపట్టారన్నారు. చంద్రబాబు చర్యతో మేధావులు, రాజకీయ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారని, సుమారు రూ. 16 వందల కోట్లు ఖర్చు చేసి ఎక్కడా లేని విధంగా నిబంధనలు పెట్టి.. ఎన్నికల్లో డబ్బు సంచులు మోసిన వారికి కాంట్రాక్టులు ఇప్పించి వందల కోట్లు దోపిడీకి పాల్పడ్డారన్నారు. పట్టిసీమ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడింది వాస్తవమన్నారు. కేంద్ర బడ్జెట్లో పోలవరానికి అరకొర నిధులు కేటాయించిన ఏ ఒక్క రోజు చంద్రబాబు మాట్లాడలేదని, ఒత్తిడి తీసుకురాకుండా అవినీతి కోసం పట్టిసీమ ప్రాజెక్టకు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలు చేశారన్నారు. <br/>చంద్రబాబు వైఖరి చూస్తుంటే పోలవరం మీద చిత్తశుద్ధి ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని బొత్స అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించాల్సిన నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారన్నారు. రెండోసారి పోలవరం సందర్శించిన గట్కరీ చంద్రబాబుకు సూటిప్రశ్నలు వేశారని, వాటికి సమాధానం చెప్పాలేక మీడియా సమక్షంలో చంద్రబాబు నీళ్లు నమిలారన్నారు. మొదటి డీపీఆర్, రెండో డీపీఆర్కు ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయి.. ల్యాండ్ ఎక్స్టెన్షన్, నిర్మాణాల అంచెనా ఎందుకు ఎందుకు పెరిగిందని అడిగితే సీఎం నేరస్తుడిలా బేల మోహం వేసుకున్నారని, సమాధానం చెప్పాలేక బిత్తర చూపులు చూశారన్నారు. చంద్రబాబు నైజం. వీక్నెస్ కేంద్రమంత్రికి తెలుసు కాబట్టే జంకుతున్నారన్నారు. ఉత్తరకుమారుడిలా మాట్లాడుతున్న నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా..? ఇది జరిగి 24 గంటలు అవుతున్నా.. ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో అవినీతిని సహించేది లేదని చెప్పారని, అంటే పోలవరంలో అవినీతి జరందని.. చంద్రబాబు వ్యవహార శైలి, నడవడిక, భాషను బట్టి స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. <br/>లక్షలాది మందిని ఆదుకునే పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టి అవినీతి కోసం నిర్మాణాన్ని అడ్డుకోవడం భావ్యమా చంద్రబాబూ అని బొత్స ప్రశ్నించారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉందా.. ఉంటే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ కట్టి జాతికి అంకితం అంటారు.. ప్రతి సోమవారం పోలవరం అన్నారు అని అనేక మార్లు ప్రజలను మోసగించారన్నారు. దయచేసి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరంపై మీ తాలూకా విధానం ఏంటో స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతున్నాం.. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.