<strong>14న ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం <br/></strong><strong>కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ ఉల్లంఘనకు నిరసన</strong><strong>పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీలను విస్మరించింది</strong><strong>అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు</strong><strong>దీక్షలు చేస్తూ ప్రధాని కొత్త సమస్య సృష్టిస్తున్నారు</strong><strong>బీజేపీ దీక్షలు ప్రజాస్వామ్యానికి చీడ</strong><strong>ప్రత్యేక హోదా హీరోగా, నిప్పు, కత్తి అంటూ బాబు ప్రచారం విడ్డూరం</strong><strong>సొంత మామను, ప్రజలను వెన్నుపోటు పొడిచిన కత్తి</strong><strong>ఎన్టీఆర్ ఇంట్లో, కాపు ఉద్యమంలో రగిలిన నిప్పు చంద్రబాబు</strong><strong>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి</strong>హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు. రాజ్యాంగ పరిధిలను విస్మరించి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న ప్రభుత్వాల నైజాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలోని అంశాలను, ప్రత్యేక హోదాను ఇస్తామని కేంద్రం చేసిన హామీని దగాగా మార్చిన నైజాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘన చేసి వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని మండిపడ్డారు. ఇప్పటికీ అసెంబ్లీ జాబితాలో ఫిరాయింపుదారులంతా వైయస్ఆర్ సీపీలో ఉన్నారన్నారు. జన్మభూమి కమిటీల నుంచి ప్రతి ఒక్క అంశంలో అడుగడుగునా.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. ఉల్లంఘన చేస్తూ అపహాస్యం చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ ఈ నెల 14వ తేదీన పెద్ద ఎత్తున రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా భావిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఈ మేరకు పార్టీ తరుపున భూమన కరుణాకర్రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. <strong>బండారం బయటపడుతుందనే ..</strong>అత్యన్నతమైన పదవిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త సమస్యలను సృష్టించడం ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం చెప్పడమేనని భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ను సజావుగా నడిపించడం లేదని ప్రధాని మోడీ చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని వైయస్ఆర్ సీపీ ఖండిస్తుందన్నారు. ఎవరైనా ఆందోళనలకు దిగితే.. ఆ ఆందోళనకు విరమింపజేసి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. కొత్త సమస్యలు సృష్టించడం సమంజసం కాదన్నారు. దీక్షల పేరుతో బీజేపీ డ్రామాలాడుతుందన్నారు. పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చకు అవకాశం లేకుండా చేసి తన పెంపు#డు బిడ్డలు లాంటి ఏఐడీఎంకే సభ్యులతో ఉద్దేశ్యపూర్వకంగా సభను స్తంభింపజేసిందన్నారు. సభలో హోదాపై చర్చ జరిగితే.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు కారణమయ్యారో.. ఏయే హామీలు ఇచ్చి మోసం చేశారో.. అవన్నీ బట్టబయలు అయ్యేవన్నారు. బీజేపీ దీక్షలు ప్రజాస్వామ్యానికి చీడలాంటివని అభిప్రాయపడ్డారు. <strong>నాలుగేళ్లుగా హోదాను సమాధి కట్టేందుకు విశ్వప్రయత్నం..</strong>నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అనే మాటకు సమాధి కట్టేందుకు విశ్వప్రయత్నం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం హోదాకు ఆయనే హీరోగా తన ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని భూమన మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తామని యువతను భయబ్రాంతులకు గురి చేసి. పోరాటం చేస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలపై అనేక కేసులు పెట్టాడని విరుచుకుపడ్డారు. 40 సంవత్సరాలుగా నిప్పులా బతికాను.. కత్తిలాంటి వాడిని.. నాకంటే సీనియర్ నేతలు దేశంలో ఎవరూ లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా చంద్రబాబు కత్తే అది ఎలాంటి కత్తి అంటే.. తన సొంత మామను వెన్నుపోటు పొడిచిన కత్తి.. తన సొంత బావను రాజకీయంగా సమాధికట్టిన కత్తి.. ఆంధ్ర ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేయడానికి విసిరిన కత్తి అలాంటి వాడని ఆరోపించారు. చంద్రబాబు నిజంగా నిప్పే.. పత్తిబేళ్లు, పూరి గుడిసెలను, అమాయకSప్రజలను జీవితాలను బుగ్గిచేయడానికి వాడే నిప్పు. అమరావతి అరటితోటల్లో, ఎన్టీఆర్ ఇంట్లో, కాపు ఉద్యమంలో మండిన నిప్పులాంటి వాడన్నారు. <strong>అమ్మను చంపి అనాథ అన్న చందంగా బాబు వైఖరి</strong>అమ్మను చంపి అనాథనని ఏడ్చినట్లుగా హోదా ఉద్యమాన్ని పూర్తిగా అణగదొక్కి.. ఈ రోజున ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నేనే పైకెత్తుతున్నా.. అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబు శల్యుడికి ఎక్కువ.. శకునికి తక్కువ అని. హోదా ఉద్యమానికి చంద్రబాబు శల్యుడు.. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమైన శకుని అన్నారు. చంద్రబాబు జీవితం పురుగులు తిన్న కాగితాల పుట్టేనన్నారు. ఒక్క నిమిషం కూడా చంద్రబాబును చూసి ఆదర్శంగా తీసుకొనే లక్షణాలు లేవన్నారు. అనునిత్యం మోసాలు, అబద్ధాలేనన్నారు. నీచపు విలువలు కలిగిన చంద్రబాబు విశ్వసనీయత కోసం పాటుపడే వైయస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. <strong>ఆ హత్యల వెనుక బాబే ఉన్నారు..!</strong>కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగాను హత్య చేయించడంలో ప్రధాన భూమిక పోసించిన వ్యక్తి చంద్రబాబేనని అప్పటి హోంమంత్రి హరిరామ జోగయ్య ప్రకటించారని భూమన గుర్తు చేశారు. మల్లెల బాబ్జి అనే వ్యక్తితో ఎన్టీఆర్పై చంద్రబాబు దాడి చేయించాడని, అనంతరం బాబ్జీ ఆత్మహత్యకు కూడా చంద్రబాబే కారణమని చరిత్ర చెబుతుందన్నారు. అనంతపురంలో 600ల మందిని శవాలు కూడా కనిపించకుండా హత్య చేయించడం వెనుక చంద్రబాబు అధికార దాహం తప్ప మరొకటి లేదన్నారు. <strong>అవినీతిని వెలెత్తి చూపకూడదా..</strong>దేశంలోనే అవినీతి సామ్రాట్గా చంద్రబాబు విరాజిల్లుతున్నారని భూమన ఆరోపించారు. నాలుగేళ్లుగా రూ. 3.5 లక్షల కోట్లు దోపిడీ చేసి.. వేల ఎకరాలకుపైగా దండుకొని ప్రజలను నట్టేట ముంచాడన్నారు. ప్రజలు ఎలాంటి సంక్షేమాన్ని అందించాలనే విధానం లేకుండా ప్రతి ఒక్క అంశంలో ఎన్ని కోట్లు పిండుకోవచ్చు అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలను వైయస్ఆర్ సీపీ అడ్డుకుంటుందని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతికి పాల్పడితే.. అడ్డుకోవడం తప్పు ఎలా అవుతుంది చంద్రబాబూ అని ప్రశ్నించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్నాడనే కుట్రతో తన ప్రచార మాధ్యమాలతో చంద్రబాబు నిరంతరం వైయస్ఆర్ సీపీపై దాడి చేయిస్తున్నారన్నారు. ఇంకా చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. అద్దంలో అన్నం చూపించి తినండి అనే చంద్రబాబు నీచపు పోకడలు ప్రజలంతా అర్థం చేసుకున్నారన్నారు. ప్రజల సమస్యలను కడతేర్చేందుకు వైయస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్రలో కలిసివస్తున్న పాదుకలు చంద్రబాబు పతనానికి అస్త్రాలుగా మారుతాయన్నారు.