రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు మృతిపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో లారీ-కారు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్ళున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం, ఒకే కుటుంబం వారంతా ఇలా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top