కాసేప‌ట్లో ప్రకాశం జిల్లా పొదిలికి వైయ‌స్‌ జగన్ 

పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు పర్యటన 

పొగాకు బోర్డును సందర్శించి రైతులతో ముఖాముఖి

ప్ర‌కాశం జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.

పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉద­యం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి పొదిలికి బయల్దేరుతారు. పొగాకు బోర్డును సందర్శించి పొగాకు రైతులతో ముఖా­ముఖి అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Back to Top