సీఎం వైయ‌స్‌ జగన్‌కు నితీష్‌ కుమార్‌ ఫోన్‌

 తాడేపల్లి : బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఫోన్‌ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కి మద్దతు పలకాల్సిందిగా నితీష్‌ సీఎం వైయ‌స్ జగన్‌ను ఫోన్‌లైన్‌లో కోరారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ ‌సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. 

కాగా సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది.  

Back to Top