చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాడుతమిళనాడులో వున్న ఐక్యత మనలో లేదని అందరూ అంటున్నారు అన్నాడో విలేకరితమిళనాడు వేరు. మనం వేరు అన్నాడు బాబువేరు ఎలా అవుతాయి? రెండూ భారతదేశంలోనే కదా వున్నాయి అన్నాడు విలేకరినాడు అంటే ప్రాంతం. ప్రదేశ్ అంటే దేశం. ప్రాంతానికి, దేశానికి తేడాలుంటాయి. విస్తృతమైన అర్థం కోసం తెలుగుదేశం అని పార్టీ పెట్టుకున్నాంఇక్కడ మేము అర్థాలు అడగలేదు. అర్థవంతమైన పాలన అడుగుతున్నాంనేను అందిస్తున్నది కూడా అర్థవంతమైన పాలనే. అర్థం అంటే డబ్బు. మా పాలన డబ్బుతో ముడిపడి వుంది. డబ్బు లేనిదే మా గవర్నమెంట్ లో ఏ పని జరగదుతమిళనాడు లాగా మనం కూడా ప్రత్యేకహోదా కోసం ఎందుకు ఉద్యమించడం లేదుప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి రెండూ ఒకటే కదాఅని ఎవరు చెప్పారు?ఎవరో ఎందుకు నేనే చెబుతున్నా, నేను చెప్పిందే వేదంజల్లికట్టు కోసం వాళ్లు కేంద్రం మెడలు వంచితే, మీరు కేంద్రం దగ్గర తలవంచుకొని జీవిస్తున్నారుకేంద్రాన్ని బతిమిలాడి, కాళ్ల వేళ్ల పడి పనులు సాధించాలి. గొడవపడితే నిధులు రావునిధులు కాదు, మీ ఓటుకి నోటు కేసుని బయటకు తీస్తారని చెప్పండిఅవన్నీ ప్రతిపక్ష నేత ఆరోపణలుమరి అది నిజం కాకపోతే కేంద్రాన్ని నిలదీయండినిలదీస్తే కాళ్లు ఇరగ్గొడతారు. అమరావతి కట్టాలని లేదా మీకుమూడేళ్ల నుంచి పాడిన పాటే పాడుతున్నారు. అక్కడ అమరావతి లేదు, హోమియోపతి లేదు. దేశాలన్ని తిరిగి జనం నెత్తిన ఖర్చులు బాదుతున్నారుదావోస్ లో అందరూ నన్నే పొగిడారు తెలుసా?అవును మీ మీడియా రాసింది కదా, మీరు చలికి వణుకుతున్నారు అని కూడా రాసిందినేను చలికి వణకడం లేదు. ఎలెక్షన్లు దగ్గరికి వచ్చాయని వణుకుతున్నానుదానికి వణకడమెందుకు? ఈసారి దుప్పటి కప్పుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిందేఅవన్నీ గిట్టని వాళ్ల రైతులు. ఈ రెండున్నరేళ్లు మేము అద్భుతాలు చేసాంఅవును, చేసారు. ఫీజుల రూపంలో తల్లితండ్రుల రక్తం తాగే నారాయణని మంత్రి చేసారు. గుంటూరులో ఎలుకలు పసికందుని పీక్కుతిన్నాయి.పుష్కరాల్లో జనం తొక్కిసలాడి చచ్చిపోయారు. అన్నిటికన్నా వింత శుంఠ లోకేష్ కి పార్టీ పదవి ఇవ్వడంపోలవరం తెచ్చానువూరుకొండి సార్. ఆలుచూలు లేదు అన్నట్టుంది. అక్కడ ఏమీ ఇంకా మొదలేకాలేదు. అప్పుడే పోలవరంతో అంతా సస్యశ్యామలమైనట్టుమాట్లాడుతున్నారుపట్టిసీమ రాలేదా?అవును సీమలో అందరూ సిరిసంపదలతో తూలతూగుతున్నారు. రైతుల ఆత్మహత్యలు కంటికి కనపడలేదా?నా కళ్లకి అంతా పచ్చగానే వుంది అంటూ బాబు ముగించాడు