ఇది 'మహానాడా' లేక 'దగానాడా'

ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం 

అధికారం ఉంది కదా అని.. అక్రమ కేసులు పెట్టడం సరికాదు 

అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం

ప్రత్యేక హెలికాప్టర్లలో కూటమి ప్రభుత్వం టూర్లు 

ఒకరేమో టీ తాగేందుకు ఢిల్లీ వెళితే.. మరొకరు విందు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారు..

సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను నిలువు దోపిడి 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ 

అనంతపురం: తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కదా అని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మీసాల రంగన్న, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నరసింహులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లయ్యలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే రెండు మూడు నెలలు మంచి ప్రభుత్వం అంటూ కాలయాపన చేశారు.

విజయవాడ వరదల కారణంగా మరో రెండు నెలల పాటు కాలం గడిపారు.. ప్రజలు తిరుగుబాటు మొదలవుతుంది అన్న సందర్భంలోనే ప్రజల మనసు డైవర్ట్ చేసేందుకు తిరుమల వెంకటేశ్వరుని సైతం లడ్డులో కల్తీ జరిగిందని రాజకీయ పబ్బం గడిపారని విరుచుకుబడ్డారు. మరో రెండు నెలలపాటు అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు నాటకాలు వేస్తూ ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపు చర్యగా వెకిలి చేష్టలు చేస్తూ కాలం గడిపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాఫీ తాగి రావడానికి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళుతున్నారని  ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ జెండా, అజెండాను మోస్తున్నారని జోష్యం చెప్పారు. రెడ్ బుక్ స్టార్ లోకేష్ ప్రధానితో విందు చేసి వస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలు మొక్కుబడిగా ఉన్నాయే తప్ప రాష్ట్రానికి ఏమాత్రం నిధులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జండా మోస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటనల పేరుతో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభివృద్ధిని మరిచారని తెలిపారు. వైయస్సార్ జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడులో  ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రులు గాని, టీడీపీ నాయకులు గాని అభివృద్ధిపై ప్రసంగం లేదని స్పష్టం చేశారు.

మహానాడులో టీడీపీ శ్రేణులు తిరుగుబాటు ఎగురవేస్తున్నారని, టీడీపీ పతనానికి అంతకంటే ఏం ఉదాహరణ కావాలని పేర్కొన్నారు. ప్రజల జీవితంలో వెలుగులు నింపిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అని కొనియాడారు. కార్యాలయాల్లో మా నాయకుని ఫోటో తీయించినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, మా నాయకుడి ఫోటో రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉందని గర్వంగా చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి చేపట్టిన వెంటనే గ్రామ గ్రామాన సచివాలయాలు, విలేజ్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదని ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులను ఆదుకున్నారన్నారు. అమ్మ ఒడి పేరుతో స్కూలుకెళ్లే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేశారన్నారు. అంతేకాకుండా ఆరోగ్య శ్రీలో అనేక వ్యాధులను చేరుస్తూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేశారని, ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు, దాదాపు 700 కోట్లు నిధులు వెచ్చించి ప్రతి గ్రామంలో మంచినీరు అందించి కిడ్నీ బాధితులకు అండగా నిలిచారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లను అత్యధిక సౌకర్యాలతో తీర్చిదిద్ది తెలుగు, ఇంగ్లీష్ మీడియం బోధించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. అభివృద్ధి, సంక్షేమం శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను వంచనకు గురి చేస్తున్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పి ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, పార్టీ ఎస్టీ సెల్ నాయకులు రాజు నాయక్, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి తాడిమర్రి నరేంద్ర, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా సోషల్ మీడియా జాయింట్ సెక్రెటరీ హేమకిరణ్,  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా యువజన సెక్రెటరీ హీదయ్ తుల్లా, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ యువజన విభాగం కార్యదర్శి బాలాజీ, రూపేష్, ఓబుల్ పతి, దాదు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top