నెల్లూరు ప్రాంత అభివృద్ధి నా బాధ్య‌త‌

నెల్లూరు పార్ల‌మెంట్‌ వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి 

నెల్లూరు: నెల్లూరు నా కర్మ భూమి. ఇక్కడే పుట్టా. చదువుకున్నదీ ఇక్కడే. ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత అని నెల్లూరు పార్ల‌మెంట్‌ వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకు పెన్నమ్మ జలరాశులు ఒక వరం. సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. సముద్ర తీరం ఉంది. ఓడరేవు, పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా. పని చేయగలిగే వయసులో ఉన్న ప్రతి యువతీ, యువకుడికి ఉద్యోగావకాశాలు కల్పిస్తా. నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా మారుస్తా అంటూ సోష‌ల్  మీడియా వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి హామీ ఇచ్చారు.

వైయ‌స్ జ‌గ‌న్‌ సంక్షేమం, అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు
 ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారని  నెల్లూరు పార్ల‌మెంట్‌ వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న తప్పిదాలే ఆ పార్టీని కబళించి వేస్తున్నాయన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా టీడీపీకి రాజీనామా చేసి మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ ఎస్సీ కమిషన్‌ మెంబర్‌ రవీంద్ర వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. 
ఈ సందర్బంగా విజయసాయి మాట్లాడుతూ.. ‘1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైయ‌స్ఆర్‌సీపీ లో చేరుతున్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేసి.. పెన్షన్‌దారులకు వారిని దూరం చేయడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబళించి వేస్తున్నాయి. వాలంటీర్ మీద ఆధారపడిన ప్రతీ కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు. 

జనానికి పూర్తి క్లారిటీ ఉంది
వేమిరెడ్డి, నారాయణ లాంటి వేల కోట్ల సంపన్నులకు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నిలబెట్టిన సాధారణ అభ్యర్థులకు మధ్య జరుగుతున్న మహాసంగ్రామం ఇది. పెత్తందారుల పల్లకీ మోయాలా? ప్రజల కోసం ఆరాటపడే నాయకులను ఎన్నుకోవాలా అనే విషయంలో జనానికి పూర్తి క్లారిటీ ఉంది. డబ్బు కట్టలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఇది 1990వ దశకం కాదు అన్నారు.

Back to Top