చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
చంద్రబాబు అభినవ పులకేశి
24 Jun 2022 8:59 PM
ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేసిన వ్యక్తి చంద్రబాబు
పప్పు తిని పడుకునే వ్యక్తి సవాల్ చేయడమా?
ఎస్టీ మహిళను దేశ అధ్యక్షురాలిగా ఎన్నిక చేయడాన్ని సీఎం వైయస్ జగన్ సమర్థించారు
25న ప్రొద్దుటూరులో మెగా జాబ్ మేళా
నిరుద్యోగ సమస్య అనేదే రాష్ట్రంలో లేకుండా చేయాలనేది సీఎం సంకల్పం
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయాన్ని తప్పకుండా సాధించి తీరతాం
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువత, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. తద్వారా వారి కుటుంబానికి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడతారనేది సుస్పష్టమని, ఆ దిశలో ప్రయాణం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పటికే తిరుపతి, గుంటూరు, విశాఖలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తే 350 కంపెనీలు పాల్గొన్నాయని, 40,243 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. మూడు దశల్లో నిర్వహించిన జాబ్ మేళా ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో నాలుగో దశలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నామన్నారు. 120 కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 10వేల ఉద్యోగాలు కల్పిస్తామనే మంచి సంకల్పంలో నిర్వహించబోతున్నామని చెప్పారు.
ప్రొద్దుటూరులోని సీబీఐటీ సెమినార్ హాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఈ మూడు కూడా సమాంతంరంగా అభివృద్ధి చెందాలన్నారు. ఆ దిశలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో వాళ్ల ఆలోచనలు వేరేరకంగా వెళ్లకుండా ఉద్యోగంపై దృష్టి పెట్టి రాష్ట్రంతో పాటు కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడతారన్నారు. ఉద్యోగ అవకాశాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయమన్నారు.
విజయసాయిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మేము నిర్వహిస్తున్న జాబ్ మేళాను విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంచుమించు 60 ప్రభుత్వ రంగ సంస్థలును మూసేశారు. ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా.. తీసేసిన ప్రభుత్వం చంద్రబాబుది.
అదే ఈ మూడేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వలంటీర్ వ్యవస్థలో మొత్తం 4లక్షల 50వేల ఉద్యోగాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు. ఇవి కాకుండా వైద్యరంగంలో 30వేలు ఉద్యోగాలు కల్పించారు. రాబోయే కాలంలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇంచుమించు 5లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. దానికి విరుద్ధంగా చంద్రబాబు తన 14ఏళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, ఉద్యోగాలను కల్పించడంపోయి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.. తన హయాంలో ఒక్క జాబ్ మేళా అయినా నిర్వహించాడా అని తనను తాను ప్రశ్నించుకుంటే మా ప్రభుత్వాన్ని విమర్శించడు.
ఉద్యోగాలు కల్పిస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబును అభినవ పులకేశిగా అభివర్ణించాలి. అలాంటి వ్యక్తిని నమ్మవద్దని సూచిస్తున్నాం. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి, విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ జాబ్ మేళా ప్రక్రియ కొనసాగుతుంది.
కరోనా సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా వాటిని కొనసాగిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పించడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదు. వాస్తవంగా ఇది ప్రజలందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వం. అలాగే ఏపీపీఎస్సీలో ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రాబోయే రెండేళ్లలో కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్ జిల్లాలో పలు భారీ, మధ్యతరగతి పరిశ్రమలు వచ్చాయి, మరెన్నో పరిశ్రమలను ఇక్కడకు తీసుకువస్తున్నారు, ఎన్ని రాబోతున్నాయేది ప్రత్యేకంగా జిల్లా ప్రజలకు చెప్పనవసరం లేదు. 50శాతం మహిళా సాధికారిత అనేది ముఖ్యమంత్రి అభిమతం. గతంలో నిర్వహించిన జాబ్ మేళాల్లో 40 వేల ఉద్యోగాల్లో అధికంగా మహిళలు, మహిళా విద్యార్థినులు మాత్రమే ఎన్నిక కాబడ్డారు.
సోషల్ జస్టిస్ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి స్థానానికి ఒక ఎస్టీ మహిళను దేశ అధ్యక్షురాలుగా ఎన్నిక చేయడాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమర్థించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు అభివృద్ధి చెందేలా పథకాలు రూపొందిస్తున్నాం.
ఈ మధ్యకాలంలో నారా లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అతడు చదవిన చదువు ఏంటి? నిజంగానే చదివాడా? అయిదేళ్లు మంత్రిగా పనిచేసి, మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి అర్హుడా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. యుద్ధ వీరులో, యుద్ధం చేసి గెలిచినవాళ్లో సవాల్ చేస్తే బాగుంటుంది. పప్పు తిని పడుకునే వ్యక్తి సవాల్ చేయడం సరికాదు.
ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారంతా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లు మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంటర్వ్యూ జరిగినప్పుడు అధైర్యపడకుండా వాళ్లకు తెలిసింది చెబితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ఎంపిక కాలేదో వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెండేళ్లలో నిరుద్యోగ సమస్య అనేదే రాష్ట్రంలో లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయాన్ని తప్పకుండా సాధించి తీరతాం.