కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
22 Jul 2019 10:44 AM
ఎమ్మెల్యే వరప్రసాద్
విజయవాడ: నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గంలో ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 2019లో ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. తనకు 46 వేల మెజారిటీ ఇచ్చారన్నారు. చెన్నై– బెంగుళూరు కారిడార్ను అతిత్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఈజెడ్లో శ్రీసిటీలో ఉన్నట్లుగా మా నియోజకవర్గంలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎస్ఈజెడ్ కోసం భూములు కోల్పయిన డికేటి, అసైండ్ ల్యాండ్కు పరిహారం రూ.13 లక్షలు ఇస్తుందని కలెక్టర్ చెప్పారని, శాశ్వతంగా భూములు దూరమవుతున్నాయి కాబట్టి కనీసం రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. గూడురు నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావాలని కోరారు.