రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చంద్రబాబుకు పిచ్చిపట్టినట్లుంది
30 Dec 2019 6:17 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అపూర్వ స్వాగతాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే పిచ్చిపట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించిన సీఎంకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. సీఎం వైయస్ జగన్కు వచ్చిన అపూర్వ స్వాగతాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు అర్థరహిత మాటలు వింటుంటే బహుశా ఆయనకు పిచ్చిపట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. విశాఖ మెంటల్ ఆస్పత్రిలో కూడా చంద్రబాబును జాయిన్ చేసుకోరేమో అని, ఆ విధంగా ఆయన చేష్టలు, వేషాలు ఉన్నాయన్నారు.