కుంజా రజితకి వైయ‌స్ జగన్ అభినందనలు 

తాడేప‌ల్లి: భారత అథ్లెట్ కుంజా రజిత కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 4x400 రిలేలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వైయ‌స్‌ జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. 

‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని వైయ‌స్ జ‌గ‌న్ తన సందేశంలో ఆకాంక్షించారు.

Back to Top