రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై వైయస్‌ జగన్‌ విచారం

తాడేప‌ల్లి: నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్య‌వ‌సాయ కూలీల మృతి ప‌ట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం, ఏఎస్‌పేట అడ్డరోడ్డు వద్ద కారు- ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందడం బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్తున్న పొగాకు కూలీలు రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆవేదన కలిగించింది అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top