పర్యావరణ పరిరక్షణతోనే మానవ‌ మనుగడ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తోనే మాన‌వాళి మ‌నుగ‌డ ఇమిడి ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ఓ సందేశం పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ..

ఈ భూమండలాన్ని ప్లాస్టిక్‌ భూతం కమ్మేస్తోంది. ప్లాస్టిక్‌ను నిరోధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ఇచ్చిన సందేశం అత్యంత ప్రాధాన్యమైనది. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఇమిడి ఉందనేది అక్షర సత్యం - దీనికి మనమంతా బద్ధులై ఉండాలని ఆశిస్తున్నాను.

Back to Top