కదిరిలో క‌దం తొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

వెన్నుపోటు దినం నిర‌స‌న కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న‌

సత్యసాయి జిల్లా:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత పిలుపు మేర‌కు క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు క‌దం తొక్కారు. బుధ‌వారం క‌దిరి ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన వెన్నుపోటు దినం నిర‌స‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది.  నిరసన కార్యక్రమాని కదిరి నియోజకవర్గం లో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  ప్రజా వ్యతిరేకతను చాటి చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నేటికీ సంవత్సరకాలం పూర్తి అయినపట్టికి  ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కూటమి నేతల జోబులు నింపుకొనే కార్యక్రమాన్ని చేపట్టిందని వికలాంగుల పింఛను నుంచి రైతన్నలకు అందించే రైతు సాయం వరకు,మహిళలకు ఫ్రీ బస్సు నుంచి తల్లికి వందనం వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చక కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజల్ని "వెన్నుపోటు" పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క కూటమి ప్రభుత్వమేనని ఇలాంటి మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా సత్యసాయి జిల్లా కదిరిలో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున నాయకులు,కార్యకర్తలు,ప్రజలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడానికి నిరసనగా వెన్నుపోటు దినం సందర్బంగా త‌హ‌శీల్దార్ మురళీకృష్ణకు కూటమి ప్రభుత్వ హామీలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు.  కార్య‌క్ర‌మంలో  హిందూపురం పార్లమెంట్ పలిశీలకులు రమేష్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి  , మాజీ శాసనసభ్యులు అత్తర్ చంద్ బాష, పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to Top