గుంటూరు: వైయస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్కు వెళ్తుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అయితే,తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తిసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన సీఐ.. అడ్డుకుంటాం అంటూ అంబటిపై దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారు. అంబటి రాంబాబుని ఏంటి పళ్ళు కోరుకుతున్నావ్ అంటూ మీదకు వెళ్లారు. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు దురుసు ప్రవర్తనపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.