దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో  దమ్ముంటే నిరూపించాలి

టీడీపీ నేతలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్‌ 

గుంటూరు:దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో  దమ్ముంటే నిరూపించాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.  తన రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2006లో రాంకీ సంస్థలో తాను ఉద్యోగం చేశానని.. 2006-21 వరకు రాంకీ గ్రూప్‌లో తనకు ఏ విధమైన షేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ షేర్లు, మూలధనం ఏమిటో టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.

మంగళగిరిలో లోకేష్ పై తాను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచానన్నారు. పుష్కరాల పేరుతో తాడేపల్లిలో రెండువేల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు.

Back to Top