కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
మెగా క్లస్టర్ల వల్లే చేనేతలకు మేలు
22 Jul 2019 10:37 AM
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అమరావతి: గత ప్రభుత్వం చేనేతలను చిన్నచూపు చూసిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బడ్జెట్లో ఘనంగా చూపి నిధులు మాత్రం ఖర్చు పెట్టలేదని తెలిపారు. వ్యవసాయం తరువాత అధిక ప్రాధాన్యత చేనేతదే అని చెప్పారు. బ్లాక్ స్థాయి క్లస్టర్ల వల్ల ప్రయోజనం లేదని వివరించారు. మెగా క్లస్టర్ల వల్లే చేనేతలకు మేలు జరుగుతుందని చెప్పారు.
గత ఐదేళ్లలో రూ. 875 కోట్లు బడ్జెట్లో చూపించి రూ.473 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేనేతలకు రూ.320 కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు. 3 లక్షల కుటుంబాలకు ఆ రుణమాఫీ వర్తించిందని, ఆ రోజుల్లోనే రూ.150 కోట్లు బడ్జెట్లో కేటాయించారని చెప్పారు. మా నియోజకవర్గంలో బోగస్ సహకార సంఘాలు ఏర్పాటు చేసి, గతంలో సభ్యులు లేకుండానే రుణాలు దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని మంత్రిని కోరారు. నేతలన్న జీవితాలు బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించారని, సీఎంకు ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు.