తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్రగా సాగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. గురువారం సునీత మీడియాతో మాట్లాడారు. - 58 నెలలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుపరి పాలన జరిగింది. మా పాలనలో ఎక్కడ అవినీతి లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచింది. - ఇడుపుల పాయ నుండి ఇచ్చాపురం వరకు వైయస్ జగన్ కి ప్రజలు బ్రాహ్మరధం పట్టారు - వైయస్ జగన్ పాలన చూసి ఓర్చుకోలేక చంద్రబాబు,పవన్ ఆరోపణలు చేస్తున్నారు. - రాష్టంలో మళ్ళీ వైయస్ జగనే సీఎం అవ్వాలని పేదలందరూ భావిస్తున్నారు. -రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ నాయకుల దాడులు జరుగుతున్నాయి. - అభివృద్ధి, సంక్షేమం మాకు రెండుకళ్లు.ముఖ్యంగా పేదల అభివృద్ధి మాకు ముఖ్యం. - రాష్టంలో ఎక్కడకి వెళ్లినా ప్రజలు ఆనందంగా ఉన్నారు.జగన్ గారికి బ్రహ్మరధం పడుతున్నారు. - వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మళ్ళీ గెలవబోతుంది. - ప్రజావిశ్వాసం లేని లోకేష్ మంగళగిరిలో గెలిచే పరిస్దితి లేదు. - చంద్రబాబు వైయస్ జగన్ గారి చేస్తున్న విమర్శలు ఆపాలి. - చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పధకాలను ప్రజలు నమ్మడం లేదు. - అందుకే వాటి ప్రచారం మరిచి జగన్ గారిపై దూషణలు,అనుచిత వ్యాఖ్యలు,వ్యక్తిగతంగా కించపరచడం చేస్తున్నారు. - వైయస్ జగన్ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల సమస్యలను పధకాల అమలు చేయడం ద్వారా తీర్చారు. - పార్టీ మేనిఫెస్టోను తూచతప్పకుండా అమలు చేశారు. - అందుకే ప్రజలు విశ్వసనీయత,నమ్మకానికి ప్రతీకగా జగన్ గారిని ప్రతీకగా భావిస్తున్నారు. - తెలుగుదేశం కూటమి గెలవదనే ప్రస్టేషన్ లో చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ లు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. - ఆ కూటమికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం.