రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన
31 Jul 2019 12:10 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్ర సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలను వివరించడంతోపాటు రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిందిగా విన్నవిస్తారు.
ప్రధానితోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తెస్తారు. వీరితోపాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కూడా సీఎం వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉంది. శాసనసభ ఫలితాలు వెలువడ్డాక మే 26న, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జూన్ 19న ఢిల్లీ వెళ్లినా కొన్ని గంటలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా ప్రధాని, మంత్రులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.