వైయ‌స్ జగన్ తాడేపల్లి పర్యటన వాయిదా  

తాడేపల్లి:  తుపాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. తుపాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దుచేశారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు ఆయన వస్తారని ప్రకటనలో వెల్లడించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.

Back to Top