వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు, బోండా ఉమా పురుష అహంకారులు
27 Apr 2022 3:06 PM
మాజీ ముఖ్యమంత్రి అయితే మహిళా కమిషనర్ను తిడతారా..? భయపెడతారా..?
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమా పురుష అహంకారులని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి మండిపడ్డారు. విజయవాడ ఆసుపత్రి వద్ద ఆ ఇద్దరు చేసిన తప్పులకు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి అయితే మహిళా కమిషనర్ను తిడతారా..? భయపెడతారా..? అని ధ్వజమెత్తారు.
ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు.
మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం
రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం
మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం
నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు
ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్పర్సన్ను అడ్డుకోవడం
ఆరో తప్పు: తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం
ఏడో తప్పు: తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం
ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం
తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం
పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం
అయితే ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ఆమె తెలిపారు.