రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవానికి రండీ..
01 Jun 2022 7:24 PM
సీఎం వైయస్ జగన్కు ఆహ్వానపత్రిక అందజేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎం వైయస్ జగన్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికను అందజేశారు. అంతకుముందు టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు ఉన్నారు.
ఈనెల 4వ తేదీ నుంచి అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.