బాలకృష్ణ వియ్యంకుడి భూ కేటాయింపులు రద్దు

సచివాలయం: ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేస్తూ.. గత ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు చేసిన భూకేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో నారా చంద్రబాబు తన సమీప బంధువు, బాలకృష్ణ వియ్యంకుడికి ఎకరా కేవలం నామమాత్రపు ధర రూ. లక్షకు 498.93 ఎకరాలను కేటాయించారని చెప్పారు. అంతటితో ఆగకుండా ఆ భూమిని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువస్తూ చంద్రబాబు జీఓ జారీ చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాల్లో అత్యంత అనైతికంగా భావిస్తూ.. ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. 

అదే విధంగా విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో మార్కెట్‌లో ఎకరా రూ. 50 కోట్లు ధర పలికే అత్యంత విలువైన 13 ఎకరాల 83 సెంట్ల భూమిని హీనాతి హీనంగా ఎకరా రూ. 4 లక్షలకు లూలూ అనే సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారన్నారు. ప్రజల ఆస్తిని కొల్లగొట్టే రీతిలో ఉన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్మానించడం జరిగిందని మంత్రి పేర్ని నాని వివరించారు. 

Read Also: కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం

తాజా వీడియోలు

Back to Top