తూర్పుగోదావరి: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు.రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుకు చట్టబద్ధంగా దక్కాల్సిన ధర కాకుండా తక్కువకు కొంటున్నారన్నారు.ఎకరాకు కౌలు రైతు రూ.30వేలు వరుకు నష్టపోయారన్నారు.గోదావరి జిల్లాల్లో పంట దిగుబడి వచ్చినా రైతులకు మాత్రం లాభం లేదన్నారు.కరువు మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయలేదన్నారు.