కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
పులివెందులలో వైయస్ జగన్ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు
27 May 2019 10:38 AM
పులివెందుల: వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైయస్ జగన్ ఇంటిని ఆదివారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సెంథిల్కుమార్ ఇతర పోలీసు అధికారులతో కలసి సందర్శించారు. వైయస్ జగన్ ఇంటివద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఎక్కడ అమర్చాలి, సందర్శకులను ఇంటి లోపలికి ఏవిధంగా పంపించాలి అనే అంశాలపై చర్చించారు. అనంతరం వైయస్ జగన్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు.
ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక అధికారులకు ఎస్పీ సెంథిల్కుమార్ పలు సూచనలు ఇచ్చారు. అనంతరం హెలీప్యాడ్ ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఇంటలిజెన్స్ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, పులివెందుల డీఎస్పీ నాగరాజు, అర్బన్ సీఐ రామాంజి నాయక్, రూరల్ సీఐ రామకృష్ణుడు, ఎస్ఐ శివప్రసాద్ ఇతర సిబ్బంది
పాల్గొన్నారు.