నేడు నెల్లిమర్ల, కైకలూరులో సామాజిక సాధికార యాత్ర 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు  విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గాల్లో జరుగుతుంది. బ‌స్సు యాత్ర‌లో వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. 

ఏలూరు జిల్లా కైకలూరులో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహం 12 గంటలకు సీతారాం ఫంక్షన్ హాలులో తటస్థులతో వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు సమావేశం కానున్నారు. 3 గంటలకు ఫంక్షన్‌ హాలు నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మార్కెట్ సెంటర్‌లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, జోగి రమేష్, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరుకానున్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమర్లలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు విజయనగరంలోని జగన్నాథ‌ ఫంక్షన్ హాలులో వైయ‌స్ఆర్‌ సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కొండవెలగడ గ్రామ సచివాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం నెల్లిమర్ల వరకు ర్యాలీ జరపనున్నారు. 3:00 గంటలకు నెల్లిమర్ల ప్ర‌ధాన కూడ‌లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరుకానున్నారు.

Back to Top