రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజా సంక్షేమం వైయస్ఆర్ కుటుంబానికే సాధ్యం
30 May 2020 12:07 PM
భావితరాలు మెచ్చేలా సీఎం వైయస్ జగన్ ఏడాది పాలన
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాది పూర్తయిందని, భావితరాలు మెచ్చే విధంగా సీఎం వైయస్ జగన్ ఏడాది పాలన సాగిందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 90శాతం హామీలను ఏడాదిపాలనలో అమలు చేశారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం నిలబెట్టుకున్నారన్నారు.
ప్రజా సంక్షేమం వైయస్ఆర్ కుటుంబానికే సాధ్యమన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ఏడాది పాలనలో ప్రజలకు అందించారన్నారు. చంద్రబాబులా ఇచ్చిన మాట తప్పడం ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అలవాటు లేదన్నారు. చంద్రబాబు గురించి ప్రజలు మర్చిపోయారన్నారు. సీఎంపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారని, ప్రజలకు పనికొచ్చే ఒక్క తీర్మానం చేయకుండానే మహానాడును ముగించారన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయలేరని టీడీపీ నేతలు గతంలో విమర్శలు చేశారని, కానీ.. పదవి చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి చూపించారన్నారు. సీఎం వైయస్ జగన్ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తారన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారని, కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య, వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను గుమ్మం ముందుకే తీసుకెళ్లేలా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చారన్నారు. రానున్న రోజుల్లో మరింత అకుంఠిత దీక్షతో పాలన కొనసాగిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.