తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 23వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థానిక కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువత పోరు పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనలో యువతకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన పాపానపోలేదని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి యువతను మోసగించి ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ యువతకు వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వైయస్ఆర్సీపీ యువత పోరు చేపడుతోందన్నారు. అనంతపురం: ఈనెల 23వ తారీఖున కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు కార్యక్రమానికి సంబంధించి వై.యస్.ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి యువజన విభాగం నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కళ్యాణదుర్గం: వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో 23 వ తేదీన తలపెట్టిన యువత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ నలమూలల నుంచి యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీమండల కన్వీనర్ గొళ్ల సూరి, తాలూకా యూత్ కన్వీనర్ చరణ్, స్టేట్ సెక్రెటరీ రామాంజనేయులు, జిల్లా సెక్రెటరీ ఎర్రంపల్లి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు మల్లాపురం మల్లి, నాయకులు గోపారం శ్రీనివాసులు, మున్సిపాలిటీ వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దొడగట్ట మురళి, షేక్షావలి, హులికల్లు మల్లి, మోహన్,మొదలగు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 23వ తేదీన వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరు నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిదులు, నాయకులు, యువత సమక్షంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రొద్దుటూరు: ఈనెల 23వ తారీఖున పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన యువత పోరు కార్యక్రమ పోస్టర్ను ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు సందీప్, జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాలాజీ నివాస్, ప్రొద్దుటూరు మండల యువజన విభాగం అధ్యక్షులు రామాంజనేయ రెడ్డి, రాజుపాలెం మండల యువజన విభాగం అధ్యక్షులు యోగానంద రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు గోటూరు వెంకటేష్, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు బాషా, ప్రొద్దుటూరు మండల పార్టీ ప్రెసిడెంట్ మార్తల ఓబుల్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సురేష్, ప్రొద్దుటూరు యువజన ఉపాధ్యక్షుడు సంటి ప్రొద్దుటూరు నియోజకవర్గ స్టూడెంట్ యూనియన్ వింగ్ అధ్యక్షుడు దావూద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.