మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు

పిఠాపురం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ వంగా గీతా

కాకినాడ‌:  కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌లకు భ‌ద్ర‌త క‌రువైంద‌ని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ‌ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ వంగా గీతా విమ‌ర్శించారు. కాకినాడ‌లో ఆమె శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌హిళా హోం మంత్రిగా ఉన్నా ..మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు. మ‌హిళ‌ల భ‌ద‌త్ర‌ను ఈ ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. మహిళల భ‌ద్రత కోసం వైయ‌స్ జగన్ ఎన్నో ఆలోచనలు చేశార‌ని, దిశ చ‌ట్టం, యాప్ తీసుకువ‌చ్చి అండ‌గా నిలిచార‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సూప‌ర్ సిక్స్ హామీలిచ్చిన చంద్ర‌బాబు ఏడాది అయినా ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌కుండా వెన్నుపోటు పొడిచార‌ని విమ‌ర్శించారు. 

Back to Top