పల్నాడు జిల్లా: వైయస్ఆర్సీపీ నాయకులమంతా తమ ప్రాణాలైనా అర్పించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పల్నాడు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణం 31వ వార్డులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మారెడ్డి చెలామారెడ్డి , సత్తెనపల్లి నియోజవర్గం సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పేదల పిల్లలు సైతం ఇంజినీరింగ్ వంటి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రతి బిడ్డా బడికి వెళ్లి చదువుకోవాలన్న లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు నగదు జమ చేశారన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాల వారు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న సంకల్పంతో దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదల కోసం నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీలను కూట మి ప్రభుత్వం పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యతోపాటు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. అయితే వాటిని ప్రైవేటీకరణ చే సి, రూ.వేల కోట్లు దండుకోవాలని చంద్రబాబు కుట్ర లు పన్నుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం, అభ్యున్నతికి నిరంతరం వైయస్. జగన్ మోహన్రెడ్డి శ్ర మిస్తుంటే, చంద్రబాబు పేదల భవిష్యత్తును నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆ గ్రహం వ్యక్తం చేశారు. పేదలంటే చంద్రబాబుకు ఎ ప్పుడూ చులకనే అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.