వైయ‌స్ఆర్‌సీపీని వీడే ప్రసక్తే లేదు

ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి

పార్టీ నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

కిరాయి మూకలతో నాపై దుష్ప్రచారం

నెల్లూరు: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానేగానీ ఎట్టిపరిస్థి­తుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీ­పీ అధిష్టానా­న్ని కలి­సినట్లు, ఆ పార్టీ­లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆదాల మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించానని తెలిపారు. నెల్లూ­రు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైయ‌స్ఆర్‌సీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరా­యి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

రూరల్‌ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వీటిని ప్రజలు నమ్మే పరి­స్థితి లేదన్నా­రు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రూరల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి తీ­రుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణా­మా­లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

Back to Top