ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా కుర్చీ నుంచి జారిపడింది

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల గొంతునొక్కడం వల్లే చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి జారిపడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. మీ రాక్షస పాలనలో ఉద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు. అంగన్‌వాడీ చెల్లెమ్మలను  గు్రరాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గుండాల్లా దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడిందని గుర్తు చేశారు. 
 

Back to Top