అమరావతి: భూదానోద్యమ పితామహుడు, సమ సమాజ స్వాప్నికుడు , స్వతంత్ర్య సమర యోధుడు వినోబా భావే వర్థంతి నేడు. సమాజానికి ప్రతి వ్యక్తి ఎంతో కొంత తిరిగివ్వాలని నేర్పిన మహానీయుడాయన. ఆ గాంధేయవాది సేవలను స్మరించుకుంటూ ముందుకు సాగుదామని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆయన సేవలకుగాను భారతరత్న, రామన్ మెగసెసే అవార్డులు వరించాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆ బాబులకు ఛాన్స్ లేకుండా చేశారు ఇసుక గురించి అవాకులు చెవాకులు పేలే బాబులకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు సిఎం @ysjagan గారు. ఎవరెవరు ఉచితంగా తీసుకెళ్లొచ్చో ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిన్నర క్రితం దాకా ఇసుక మాఫియా రాజ్యమేలిన రీచ్ లలో ఇప్పుడు యంత్రాల శబ్దం తప్ప ఇసుక దొంగల నీడలు కూడా కనిపించడం లేదని మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.