తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని పదవుల్లో బీసీలకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కో-ఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి.విజయసాయిరెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ బిసీ, వాణిజ్య విభాగాల ఆధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా విజయసాయిరెడ్డి గారు సమావేశాలు నిర్వహించారు. పార్టీ బీసీ విభాగ అధ్యక్షులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి గారి నేతృత్వంలో బీసి విభాగ సమావేశం జరిగింది.. ఈ సమావేశాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ..విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి బీసీ మహాసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
బీసీ విభాగ అనుబంధ కమిటీలు ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పార్టీ పటిష్టతకు దోహదం చేస్తాయని, అదేవిధంగా త్వరితగతిన జిల్లాస్థాయి మండల స్థాయి కమిటీలను భర్తీ చేయాలని కోరారు. పార్టీ బీసీ విభాగానికి ఉపాధ్యక్షులు నియమించేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు... చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.. ఈ నాలుగేళ్ల కాలంలో బీసీలకు జరిగిన లబ్ధిని వారికి తెలియజేయాలని కోరారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు అడుగడుగునా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని, అన్ని పదవుల్లో బీసీలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.. రాజ్యసభ ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లగా మున్సిపల్ చెర్మెన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా, నామినేటెడ్ పదవుల్లో వైయస్ఆర్సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారికి వివరించారు..అలాగే
రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.
బీసీ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బీసీ కుల గణనకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, బీసీ జనాభా లెక్కింపును ఈ కమిటీ అధ్యయనం చేయనుందని తెలిపారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా జనాభా లేక్కల సేకరణకు బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చెప్పట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ ఏ.పీ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు..
చివరిగా వాణిజ్య విభాగ అధ్యక్షులు కుప్పం ప్రసాద్, పల్లె పోతూ మురళీకృష్ణ నేతృత్వంలో వాణిజ్య విభాగ సమావేశం జరిగింది..