బీసీలను టీడీపీ వాడుకొని వదిలేసింది

అన్ని కులాలకు న్యాయం జరిగేలా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కృషి

అన్ని కులాలకు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

తాడేపల్లి: తెలుగు దేశం పార్టీ బీసీలను వాడుకొని వదిలేసిందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. అన్ని కులలను న్యాయం జరిగేలా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంచార జాతిలో ఉన్న కులాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెల్లబోయిన వేణుగోపాల్‌తో కలిసి జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సంచార జాతుల ఆవేదనను వినిందని చెప్పారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, దానికి ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేసి సీఎం సలహాలు,  సూచనలు తీసుకున్నారన్నారు. సమాజంలో మార్పు రావాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలని, అది కూడా ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పించాలని సీఎం పట్టుదలతో ఉన్నారన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చించారని తెలిపారు. కార్పొరేషన్‌ చైర్మన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నామినేటేడ్‌ పదవులు కూడా 50 శాతం ఇస్తారని చెప్పారు. మార్కేట్‌ యార్డు, దేవాలయాల్లో పదవులు 50 శాతం ఈ వర్గాలకే ఇస్తారని తెలిపారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారని, బీసీ వర్గాలు తమ సమస్యలను కమిషన్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. కులాలకు సంబంధించిన ఏ సమస్యనైనా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

Read Also: బీజేపీని ఆకర్శించేందుకు బాబు కుప్పిగంతులు

తాజా వీడియోలు

Back to Top