కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఏటా వైయస్ఆర్ వన మహోత్సవం కార్యక్రమం
29 Jul 2019 11:05 AM
ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి
అమరావతి: ప్రతి ఏటా రాష్ట్రంలో వైయస్ఆర్ వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కోరారు. సోమవారం సభలో ఆయన మాట్లాడుతూ..పర్యావరణం దెబ్బతినడంతో అనంతపురం జిల్లాలో సకాలంలో వర్షాలు లేక కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రాజన్న వన మహోత్సవాన్ని నిర్వహించాలని, ఏడాదికి లక్ష మొక్కలు నాటాలని కోరారు. గత ప్రభుత్వం హంద్రీనీవా–సుజల స్రవంతి పథకాన్ని వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారు. చంద్రబాబు బుక్కపట్నం రిజర్వాయర్ ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో టీడీపీ నేతలు కొండకు పచ్చ రంగు పూశారన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీశారని విమర్శించారు. కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి కోరారు.