తిత్లీ తుఫాన్‌ బాధితులను పూర్తిగా ఆదుకోవాలి

పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు
 

అమ‌రావ‌తి: తిత్లీ తుఫాన్‌ బాధితులను పూర్తిగా ఆదుకోవాల‌ని పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ప్ర‌భుత్వాన్ని కోరారు. తిత్లీ తుఫాన్‌ అంశంపై సభలో ఆయ‌న‌ మాట్లాడారు. తిత్లీ తుఫాన్‌ ధాటికి వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపారు. దీంతో ఇళ్లు కోల్పోయి ఎంతోమంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాన్‌ సంభవించిన అనంతరం నాలుగైదు రోజులైనా వాటర్‌ ట్యాంక్‌లు బాధిత గ్రామాలకు రాలేదని, ఏడు రోజులైనా జనరేటర్లు ప్రభుత్వ యంత్రాంగం పంపించలేదని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉండగా.. టీడీపీ నేతలు మాత్రం తాము తిత్లీ బాధితులను ఆదుకున్నట్టు విస్తృత ప్రచారం చేసుకున్నారని అప్పలరాజు మండిపడ్డారు. పరిహారం కావాలని అడిగిన బాధితులపై అప్పటి సీఎం చంద్రబాబు కేసులు పెట్టించారని తెలిపారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు పర్యటించి.. సహాయక చర్యలను పర్యవేక్షించారని చెప్పారు. తిత్లీ తుఫాన్‌ బాధితులను పూర్తిగా ఆదుకోవాలని అప్పలరాజు ప్రభుత్వాన్ని కోరారు. 

Back to Top