టీడీపీ బీసీల ద్రోహి

మంత్రి వేణుగోపాలకృష్ణ
 

తూర్పు గోదావరి: తెలుగు దేశం పార్టీ బీసీల ద్రోహి అని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. టీడీపీలో బీసీలంటే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. గతంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. బీసీల కోసం చంద్రబాబు కొత్త కుయుక్తులతో నాటకాలు అడుతున్నారని మండిపడ్డారు. బీసీలను రాజ్యాధికారం దిశగా తీసుకెళతున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు. బీసీలకు 111 కార్పొరేషన్‌ పదవులు ఇచ్చి సీఎం వైయస్‌ జగన్‌ గౌరవించారని గుర్తు చేశారు.
 

Back to Top