వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆలయాల్లో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
26 Feb 2021 12:39 PM
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: ఆలయాల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆలయాలలో జరుగుతున్న అవినీతిపై గతంలోనూ విచారణ జరిపామని ఆయన తెలిపారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నాడు శ్రీశైలం, ద్వారకా తిరుమలలో చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. దుర్గగుడిలో ఏసీబీ దాడులకు సంబంధించి తనపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ దాడులు అనేవి ఒక భాగమన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ నియోజకవర్గంలో నడవలేనివారు, డిపాజిట్లు రానివారు ఉన్నారని...ఈ ఎన్నికల ద్వారా వారిని ప్రజలే తరిమి కొడతారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.