వైయస్‌ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదు

  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

 విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సీఎం వైయస్‌ జగన్ అహర్నిశలు పని చేస్తున్నారని చెప్పారు.గురువారంవిజయవాడ 41వ డివిజన్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు‌లు హైదరాబాద్‌లో కూర్చుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు బుద్దా  వెంకన్న, జలీల్ ఖాన్, కేశినేని నాని ప్రజల కష్టాలు చూసిన పరిస్థితి లేదని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ మాటలకే పరిమితమయ్యారని, చేతలు లేవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు.  
 

Back to Top